Showing posts with label AP News. Show all posts
Showing posts with label AP News. Show all posts

Saturday, January 9, 2010

సమైక్యాంధ్ర విషయంలో వెనక్కి తగ్గిన ఆంధ్రా నాయకులు... ఇంకోసారి మోసపోయిన ప్రజలు

మొన్నటి వరకి తెలంగాణ కావాలని తెలంగాణా నాయకులు, సమైక్యాంధ్ర కావలని సీమాంధ్ర నాయకులు తెగ కంగారు పడిపోయి రాజీనామాలు చేసారు కదా.. ఇప్పుడేమో కేంధ్రం శాంతి జపం మొదలెట్టాక మరి ఎమనుకున్నారో ఎమోగాని అందరూ తమ తమ రాజీనామాలను వెనక్కి తీసుకుంటున్నారంట. ఈ విషయంలో సీమాంధ్ర నాయకులదే పైచేయి అంట.. కాంగ్రెస్ వాళ్ళు మరీ ముందున్నారంట..

వీళ్ళు ఇలా వెనక్కి తీసుకుంటారనే విషయం ముందే తెలిసిన స్పీకర్ గారు వాళ్ళ వాళ్ళ రాజీనామాలని ఆమోదించలేదంట..

మొత్తం మీద ప్రజలని పిచ్చోళ్ళని చేసారు మన నాయకులు... మనల్ని ఇంకోసారి నమ్మించి మోసం చేసారు మన నాయకులు.. ఇదంతా ముందే అంతా కలిసి అడిన నాటకంలా అనిపించట్లేదు మీకు.. ఇలా నమ్మినంత కాలం మనల్ని మోసం చేస్తూనే ఉంటారు

Friday, January 8, 2010

TV5 పైన కేసులు ఎత్తివేయాలంట.....

వై.ఎస్.ఆర్ మరణం వెనుక జరిగిన కుట్రలో రిలయన్స్ అధినేత అంబాని పాత్ర ఉందని అదేదో రష్యన్ పత్రిక అప్పుడెప్పుడో రాసిన కథనాన్ని ఆధారం చెసుకొని ప్రసారం చేసిన టివి5 ఛానల్ పై హైదరాబాద్ లోని జూబ్లిహిల్ల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసారంట.. వెంటనే ఆ ప్రసారాన్ని నిలిపివేయమని ఆదేశాలు కూడా జారీచేసారంట....

ఇదంతా నిన్న రాత్రి జరిగిన సంగతి... ఇప్పుడు రాష్ట్రం లో జరిగిన విద్వంసానికి టివి5 ఒకవిధంగా కారణమే కదా.. ఇప్పుడు అదేదో యూనియన్ అంట(ఎ.పియు.డబ్లు.జె) ఈ టివి5 వాల్లకి మద్దత్తుగా ఉందంట... టివి5 పైన పెట్టిన కేసులని ఎత్తివేయాలంట.. నిన్న ప్రసారం చేసిన దాంట్లో వీళ్ళ తప్పేం లేదంట..కేసులని ఎత్తివేయకపోతే దర్నాలు చేస్తారంట...

ఆ టివి5 లొ సీనియర్ జర్నలిస్టుని పోలీసులు అరెస్టు చేసారంట .. అది తప్పంట.. అక్కది ఉద్యోగులు అంతా గొడవ గొడవ చేస్తున్నారు.. వీల్లు ప్రసారం చేసారు బాగానే ఉంది ఆ చేసేవాళ్ళు ఎదో (ఒక వేళ ఈ కథనం నిజం అని వాళ్ళు అనుకుంటే ) ఆదారాలు సంపాదించి వాటితో సహా ప్రచారం చేస్తే ఈ గొడవ ఉండేది కాదు కదా....

Thursday, January 7, 2010

వై.స్.ఆర్ మరణం వెనుక మిస్టరీ ఇదట ...

రాజశేఖరుడి మరణం వెనుక ముకేశ్ అంబాని కుట్ర --- రష్యన్ పత్రిక వెల్లడి


రాజశేఖరుడి మరణం వెనుక ఆ రష్యా వాళ్ళు చెప్పేది నిజమేనా? ఆ రష్యా వాళ్ళు ఎదో రాసారు సరే.. మన మీడియా వాళ్ళు ఏ ఆదారం తో దీన్ని ప్రసారం చేసి జనాల్లో అలజడి స్రుష్ఠించారో ... .

అసలు ఆ పత్రిక ఈ విషయాన్ని వై.స్.ఆర్ మరణించిన తరువాతి రోజే ప్రచురించింది అంట.. అప్పుడు రాసిన దాన్ని పట్టుకొని ఈ టివి5 వాళ్ళు అనవసరం గా ప్రసారం చేసి అలజడి స్రుష్టించారు.. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకి ఇది ఇంకొక ఇబ్బందిగా మారింది..

రాజశేకరుడి మరణం ఆది నుంచీ అనుమానాలు రేకెత్తిస్తూనే ఉంది ఆ మద్య టివిల్లో వార్తలు కూడా తెగ వచ్చాయ్ కదా ఇదంతా స్వప్రయోజనాల కోసం ఎవరో ఆడిస్తున్నదని ప్రజలందరికీ తెలిసిన (తెలియనట్టి) నిజం. ఇలా దీని గురించి వెదుకుతూ ఇందాకే బాలసుబ్రమణ్యం గారి టపా చదివా.. మీరు ఇక్కడ చూడొచ్చు. చాలా ధైర్యంగా రాసారు ఇవన్ని ఎవరూ ఒప్పుకోలేని నిజాలు..


మీడియా వాల్లకి నా విగ్నప్తి : దయచేసి ఊహాజనిత విషయలని ప్రసారం చేసి ప్రజలలో అలజడి స్రిష్టించ వొద్దని మనవి