Saturday, January 9, 2010

సమైక్యాంధ్ర విషయంలో వెనక్కి తగ్గిన ఆంధ్రా నాయకులు... ఇంకోసారి మోసపోయిన ప్రజలు

మొన్నటి వరకి తెలంగాణ కావాలని తెలంగాణా నాయకులు, సమైక్యాంధ్ర కావలని సీమాంధ్ర నాయకులు తెగ కంగారు పడిపోయి రాజీనామాలు చేసారు కదా.. ఇప్పుడేమో కేంధ్రం శాంతి జపం మొదలెట్టాక మరి ఎమనుకున్నారో ఎమోగాని అందరూ తమ తమ రాజీనామాలను వెనక్కి తీసుకుంటున్నారంట. ఈ విషయంలో సీమాంధ్ర నాయకులదే పైచేయి అంట.. కాంగ్రెస్ వాళ్ళు మరీ ముందున్నారంట..

వీళ్ళు ఇలా వెనక్కి తీసుకుంటారనే విషయం ముందే తెలిసిన స్పీకర్ గారు వాళ్ళ వాళ్ళ రాజీనామాలని ఆమోదించలేదంట..

మొత్తం మీద ప్రజలని పిచ్చోళ్ళని చేసారు మన నాయకులు... మనల్ని ఇంకోసారి నమ్మించి మోసం చేసారు మన నాయకులు.. ఇదంతా ముందే అంతా కలిసి అడిన నాటకంలా అనిపించట్లేదు మీకు.. ఇలా నమ్మినంత కాలం మనల్ని మోసం చేస్తూనే ఉంటారు

1 comments:

Unknown said...

nammevallane kadaa mosam chesedi. chaduvukunna vaalle moorkhullaa araachakaalu chesthunte raajakeeyame vrutthigaa unna vaallu edainaa cheyya galaru

Post a Comment