Thursday, January 7, 2010

తెలుగోడిపై వడ్డింపులు మొదలు

ఆర్.టి.సి పెంచిన ధరల విషయం గా అందరూ తెగ కంగారు పడుతున్నారు కాని.. ఈమద్య జరిగిన ఉద్యమంలో ఎన్ని బస్సులను తగలేసారో ఎవడన్నా పట్టించుకున్నాడా.. అప్పుడు ఎవరూ ఆర్.టి.సిని పాపం అని కూడా అనలేదు .. లోకంలో ఏ గోల జరిగినా మొదలు నష్టపోయేది ఆర్.టి.సి నే.. ఇందులో సగపాలు మన మూలంగానే జరిగింది అని చెప్పుకోవచ్చు. ఈ ఉద్యమంలో అంత నష్టం లేకపోయి ఉంటే ఇంతగా పెంచి ఉండేవారు కాదేమో.. "ఎవడు చేసిన కర్మ వాడనుభవించక తప్పదు" కదా.. ఈ వడ్డింపుల కార్యక్రమం ఇంతటితో ఆగదు ... మన ప్రబుత్వం పన్నులను పెంచుతుందంట కదా ... ప్రతీ ఒక్కరూ తమ ఖజానా ఎలా నింపాలా అని ఎత్తులు వేసేవారే... ఈ ఆర్.టి.సి పెంపు కారణంగా నిత్యావసర వస్తువులు మొదలు ప్రతీ ఒక్కటి ధరలు పెరుగుతాయ్. వీటి మూలంగా ఎక్కువగా నష్టపొయేది సామాన్య మానవుడే

కొసమెరుపేమిటంటే ఈ పెంపు విషయం మన ముఖ్యమంత్రి రోషయ్య గారికి అస్సలు తెలీదంట.. అంతా అయ్యాక ఇప్పుడు తగ్గింపు దిశగా చర్చలు ప్రారంభిస్తామంటున్నారు.. ఎంతవరకి సఫలం అవుతాయో చుద్దాం..

1 comments:

Anonymous said...

baaga ayyindi.
bus lu tagala pettetapudu okkadu kuda enti idi ani andolanalu cheyyadu.
charges pechagane andaru mandalu mandalu ga rodla meeda padi andolanalu chestaru.
Deeniki badulu ila andolananlu chese vaallu andaru,bus lu tagalapetee vaadini pattukoni vutakochu ga
aha adi matram cheyaru.
ippudu teerutundi tikka andariki.

Post a Comment