Friday, August 27, 2010

చాలా రోజుల విరామం తరువాత...

చాలా రోజుల విరామం తరువాత ఇలా మీ ముందుకి వచ్చా.... ఎలా ఉన్నారు ఏం సంగతులు?

Thursday, February 25, 2010

అమెరికాలో ప్రస్తుత సంగతులు

అమెరికా అంటే ఎదో అనుకుంటాం కాని ఎవరైన గొప్పలు పోయేది డబ్బులు ఉన్నప్పుడే సుమండీ.. ఒకసారి డబ్బులకి కొరత వచ్చిందంటే అప్పుడు తెలుస్తుంది.. ఈమద్య ఇక్కడ మంచు ఎక్కువగా పడింది కదా.. గత 30-40 సంవత్సరాలలో ఇంత ఎక్కువగా ఎప్పుడూ లేదంట.. అసలే ఆర్ద్థిక సంక్షోభంలో లో ఉన్నారు కదా ఇక ఆ రోడ్లపై మంచు తీసే పనులకి ఖజాన కాస్త ఖాళి అయింది.. కొన్ని చోట్ల అయితే చేతులెత్తేసారు.. ఈ మంచు తుఫానులకి చాలా రాష్ట్రాల్లో పంటలు నష్టపోయాయి.. దానితో కూరగాయల ధరలు ఇష్టమొచ్చినట్లు పెరిగిపోయాయి....

అసలు న్యూస్ విందామంటే అన్ని నష్టాల విశేషాలే..
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నయ్ సుమండీ.. ఈ సంక్షోభం నన్ను కూడా తగిలింది.. మా మానేజరు తీరిగ్గా పిలిచి బాగా పొగిడి (ఎంటబ్బా ఇంతలా పొగుడుతుందని అనుకున్నా!!) ఇక రేపటినుంచి మనం కలవలేమంటూ చావు కబురు చల్లగా చెప్పింది.... సరేలే ఎం చేస్తాం.. మళ్ళీ ఇంకొ ఉద్యోగం వెదుక్కుందాంలే అనుకొని అన్ని సర్దుకోని వచ్చేసా...

Saturday, January 9, 2010

సమైక్యాంధ్ర విషయంలో వెనక్కి తగ్గిన ఆంధ్రా నాయకులు... ఇంకోసారి మోసపోయిన ప్రజలు

మొన్నటి వరకి తెలంగాణ కావాలని తెలంగాణా నాయకులు, సమైక్యాంధ్ర కావలని సీమాంధ్ర నాయకులు తెగ కంగారు పడిపోయి రాజీనామాలు చేసారు కదా.. ఇప్పుడేమో కేంధ్రం శాంతి జపం మొదలెట్టాక మరి ఎమనుకున్నారో ఎమోగాని అందరూ తమ తమ రాజీనామాలను వెనక్కి తీసుకుంటున్నారంట. ఈ విషయంలో సీమాంధ్ర నాయకులదే పైచేయి అంట.. కాంగ్రెస్ వాళ్ళు మరీ ముందున్నారంట..

వీళ్ళు ఇలా వెనక్కి తీసుకుంటారనే విషయం ముందే తెలిసిన స్పీకర్ గారు వాళ్ళ వాళ్ళ రాజీనామాలని ఆమోదించలేదంట..

మొత్తం మీద ప్రజలని పిచ్చోళ్ళని చేసారు మన నాయకులు... మనల్ని ఇంకోసారి నమ్మించి మోసం చేసారు మన నాయకులు.. ఇదంతా ముందే అంతా కలిసి అడిన నాటకంలా అనిపించట్లేదు మీకు.. ఇలా నమ్మినంత కాలం మనల్ని మోసం చేస్తూనే ఉంటారు

Friday, January 8, 2010

ప్రవాసులకు ఓటు హక్కు కల్పిస్తానన్న మన్మోహన్

స్వదేశంలో ఓటు వేయాలనుకునే ప్రవాస భారతీయుల కల 2014 కి తీరవచ్చు అని మన ప్రధాని మన్మోహన్ నిన్న ఢిల్లి లో జరిగిన ఒక సమావేశంలో నొక్కి వక్కానించారంట. దీనికి సంబందించిన బిల్లుని రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారంట(ఈ యోచనకి ఒక జీవిత కాలం పడుతుందేమో)...

పోనీలెండి ఇప్పటికైనా వీళ్ళకి ఈ ఆలోచన వచ్హింది.. ఇన్నాళ్ళు ప్రవాసుల పెట్టూబడుల గురించి మాట్లాడినవాళ్ళు ఇప్పటికైనా మేల్కొని వాళ్ళ ఓటు హక్కు గురించి ఆలోచించారు

TV5 పైన కేసులు ఎత్తివేయాలంట.....

వై.ఎస్.ఆర్ మరణం వెనుక జరిగిన కుట్రలో రిలయన్స్ అధినేత అంబాని పాత్ర ఉందని అదేదో రష్యన్ పత్రిక అప్పుడెప్పుడో రాసిన కథనాన్ని ఆధారం చెసుకొని ప్రసారం చేసిన టివి5 ఛానల్ పై హైదరాబాద్ లోని జూబ్లిహిల్ల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసారంట.. వెంటనే ఆ ప్రసారాన్ని నిలిపివేయమని ఆదేశాలు కూడా జారీచేసారంట....

ఇదంతా నిన్న రాత్రి జరిగిన సంగతి... ఇప్పుడు రాష్ట్రం లో జరిగిన విద్వంసానికి టివి5 ఒకవిధంగా కారణమే కదా.. ఇప్పుడు అదేదో యూనియన్ అంట(ఎ.పియు.డబ్లు.జె) ఈ టివి5 వాల్లకి మద్దత్తుగా ఉందంట... టివి5 పైన పెట్టిన కేసులని ఎత్తివేయాలంట.. నిన్న ప్రసారం చేసిన దాంట్లో వీళ్ళ తప్పేం లేదంట..కేసులని ఎత్తివేయకపోతే దర్నాలు చేస్తారంట...

ఆ టివి5 లొ సీనియర్ జర్నలిస్టుని పోలీసులు అరెస్టు చేసారంట .. అది తప్పంట.. అక్కది ఉద్యోగులు అంతా గొడవ గొడవ చేస్తున్నారు.. వీల్లు ప్రసారం చేసారు బాగానే ఉంది ఆ చేసేవాళ్ళు ఎదో (ఒక వేళ ఈ కథనం నిజం అని వాళ్ళు అనుకుంటే ) ఆదారాలు సంపాదించి వాటితో సహా ప్రచారం చేస్తే ఈ గొడవ ఉండేది కాదు కదా....

Thursday, January 7, 2010

వై.స్.ఆర్ మరణం వెనుక మిస్టరీ ఇదట ...

రాజశేఖరుడి మరణం వెనుక ముకేశ్ అంబాని కుట్ర --- రష్యన్ పత్రిక వెల్లడి


రాజశేఖరుడి మరణం వెనుక ఆ రష్యా వాళ్ళు చెప్పేది నిజమేనా? ఆ రష్యా వాళ్ళు ఎదో రాసారు సరే.. మన మీడియా వాళ్ళు ఏ ఆదారం తో దీన్ని ప్రసారం చేసి జనాల్లో అలజడి స్రుష్ఠించారో ... .

అసలు ఆ పత్రిక ఈ విషయాన్ని వై.స్.ఆర్ మరణించిన తరువాతి రోజే ప్రచురించింది అంట.. అప్పుడు రాసిన దాన్ని పట్టుకొని ఈ టివి5 వాళ్ళు అనవసరం గా ప్రసారం చేసి అలజడి స్రుష్టించారు.. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకి ఇది ఇంకొక ఇబ్బందిగా మారింది..

రాజశేకరుడి మరణం ఆది నుంచీ అనుమానాలు రేకెత్తిస్తూనే ఉంది ఆ మద్య టివిల్లో వార్తలు కూడా తెగ వచ్చాయ్ కదా ఇదంతా స్వప్రయోజనాల కోసం ఎవరో ఆడిస్తున్నదని ప్రజలందరికీ తెలిసిన (తెలియనట్టి) నిజం. ఇలా దీని గురించి వెదుకుతూ ఇందాకే బాలసుబ్రమణ్యం గారి టపా చదివా.. మీరు ఇక్కడ చూడొచ్చు. చాలా ధైర్యంగా రాసారు ఇవన్ని ఎవరూ ఒప్పుకోలేని నిజాలు..


మీడియా వాల్లకి నా విగ్నప్తి : దయచేసి ఊహాజనిత విషయలని ప్రసారం చేసి ప్రజలలో అలజడి స్రిష్టించ వొద్దని మనవి

తెలుగోడిపై వడ్డింపులు మొదలు

ఆర్.టి.సి పెంచిన ధరల విషయం గా అందరూ తెగ కంగారు పడుతున్నారు కాని.. ఈమద్య జరిగిన ఉద్యమంలో ఎన్ని బస్సులను తగలేసారో ఎవడన్నా పట్టించుకున్నాడా.. అప్పుడు ఎవరూ ఆర్.టి.సిని పాపం అని కూడా అనలేదు .. లోకంలో ఏ గోల జరిగినా మొదలు నష్టపోయేది ఆర్.టి.సి నే.. ఇందులో సగపాలు మన మూలంగానే జరిగింది అని చెప్పుకోవచ్చు. ఈ ఉద్యమంలో అంత నష్టం లేకపోయి ఉంటే ఇంతగా పెంచి ఉండేవారు కాదేమో.. "ఎవడు చేసిన కర్మ వాడనుభవించక తప్పదు" కదా.. ఈ వడ్డింపుల కార్యక్రమం ఇంతటితో ఆగదు ... మన ప్రబుత్వం పన్నులను పెంచుతుందంట కదా ... ప్రతీ ఒక్కరూ తమ ఖజానా ఎలా నింపాలా అని ఎత్తులు వేసేవారే... ఈ ఆర్.టి.సి పెంపు కారణంగా నిత్యావసర వస్తువులు మొదలు ప్రతీ ఒక్కటి ధరలు పెరుగుతాయ్. వీటి మూలంగా ఎక్కువగా నష్టపొయేది సామాన్య మానవుడే

కొసమెరుపేమిటంటే ఈ పెంపు విషయం మన ముఖ్యమంత్రి రోషయ్య గారికి అస్సలు తెలీదంట.. అంతా అయ్యాక ఇప్పుడు తగ్గింపు దిశగా చర్చలు ప్రారంభిస్తామంటున్నారు.. ఎంతవరకి సఫలం అవుతాయో చుద్దాం..